పరిగి టౌన్ : పరిగి మండల పరిధిలోని యాబాజిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో మంగళవారం చండీయాగం నిర్వహించి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ శశిధర్రెడ్డి, సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.