కడ్తాల్ : నేటి తరం యువత ప్రజాకవి కాళోజీ నారయణరావుని ఆదర్శంగా తీసుకోని ముందుకెళ్లాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం కాళోజీ చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళ్లార్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ జయంతి రోజును ‘తెలంగాణ భాషా దోనోత్సవం’గా జరుపుకోవడం గొప్ప విషయమన్నారు.
అన్యాయాన్ని ఎదురించిన వారే నాకు ఆరాధ్యులు అని చాటి చెప్పిన మహనీయుడని కాళోజీ అని పేర్కొన్నారు. మా యాస, మా భాష ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడంలో తప్పేంటని ప్రపంచానికి చాటి చెప్పి, తెలంగాణ ఉద్యమానికి కాళీజీ ఊపిరి పోశారని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, సీఐ ఉపేందర్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహా రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు గంప శ్రీను, లక్పతినాయక్, లాయక్అలీ, జహంగీర్అలీ, వీరయ్య, భిక్షపతి, మహేశ్, వినోద్, జంగయ్య యాదవ్, దేవా నాయక్ పాల్గొన్నారు.