కడ్తాల్ : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదల అందరికీ సీఎం సహాయనిధి వరంలా మారిందన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ దవాఖానలో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని తెలిపారు. మండల పరిధిలోని మక్తమాదారం గ్రామానికి చెందిన సంధ్యకి రూ. 12 వేలు, మాడ్గుల్ మండలం గిరికొత్తపల్లి గ్రామానికి చెందిన సింధుకి రూ. 28 వేలు, బండోనిపల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్యకి రూ. 54వేలు చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సాజ్యానాయక్, నాయకులు వెంకట్రెడ్డి, తిరుమల్రెడ్డి, శ్రీనునాయక్, బాలయ్య, రాములుయాదవ్ పాల్గొన్నారు.