రంగారెడ్డి, జనవరి 10(నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించి బ్యాంకు లింకేజీతోపాటు స్త్రీనిధి, సీబీవో, వీవోల నుంచి ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకుంటున్నది. ఈ రుణాలు పొందిన మహిళలు చిరు వ్యాపారా లు, స్వయం ఉపాధి, సేవా రంగాల్లో పెట్టుబడి పెట్టి రాణిస్తున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఈ పరిస్థితి ఉండేది కాదు. కుటుంబ, వ్యక్తిగత అవసరాలు, పిల్లల చదువుకు ఈ రుణాలను వినియోగించేవారు. దీంతో అప్పు లు అధికమయ్యేవి. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామీణ మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్న ది. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లకు అధికారులతో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ వారికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సీబీవో, వీవోల నిధులను రుణాలను మంజూరు చేస్తున్నది. దీం తో జిల్లాలోని స్వయం సహాయక సంఘాల స భ్యులు కొత్త, కొత్త యూనిట్లను ఏర్పాటు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.
రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,253 యూనిట్లను మంజూరు చేయాలని నిర్ణయించ గా, లక్ష్యానికి మించి 3,026 యూనిట్లకు గ్రౌం డింగ్ పూర్తి చేసి, రూ.28.20 కోట్లను కేటాయించారు. 2022-23ఆర్థిక సంవత్సరంలో 5,827 యూనిట్లను మంజూరు చేయా లని లక్ష్యం గా పెట్టుకోగా 5,112 కొత్త వ్యాపార యూనిట్లను గుర్తించి అందులో 4,877 యూ నిట్లకు గ్రౌండింగ్ పూర్తి కాగా, రూ.65.77 కోట్ల రుణాలను వెచ్చించి మహిళలు వ్యాపారాల్లో ఎదిగేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఆయా యూనిట్లలో 4,485 మంది లబ్ధిదారులుగా ఉన్నారు.
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో బతుకులు ఆగమ్యగోచరంగా తయారైన ఎంతోమంది గ్రా మీణులు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో సమాజంలో సగౌరవంగా జీవిస్తున్నారు. అధికారులు వారికి ఉపాధి రంగాలపై అవగాహన కల్పిస్తూ, వారిలో చైతన్యం తీసుకొచ్చి బతుకులకు భరోసా కల్పిస్తున్నారు. పలువురు మహిళలు కొత్త, కొత్త యూనిట్లను నెలకొల్పి పదుల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తున్నారు.
బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకుని కారం పట్టే యంత్రాన్ని రూ.1,50,000 తో కొనుగోలు చేశా. దాని ద్వారా ప్రతినెలా రూ. 50 వేల వరకు ఆదాయం వస్తున్నది. దీంతో చాలా సంతోషంగా మా కుటుంబం బతుకుతున్నది.
-రావుల కలమ్మ, తూలెకుర్దు గ్రామం, యాచారం మండలం
నేను నవజ్యోతి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని చేపల వ్యాపారం నిర్వహించుకునేందుకు యంత్రాలను కొనుగోలు చేశా. చేపలను పట్టి ఈ మెషీన్లలో ఉంచడంతో తాజాగా ఉంటుంది. దీని ద్వారా ప్రతినెలా రూ.50 వేల వరకు ఆర్జిస్తున్నా. హాయిగా జీవి స్తూ ముగ్గురు పిల్లలను చదివించుకుంటున్నా.
– గడ్డం జయమ్మ, అప్పారెడ్డి గూడ గ్రామం, నందిగామ మండలం
రాములమ్మ స్వయం సహాయక సంఘానికి చెందిన నేను ఇటుకలు, రింగుల తయారీ యూనిట్ను రూ.2,35,000 ఏర్పాటు చేశా. ఇందుకు బ్యాంకు నుంచి రూ.60 వేలు, స్త్రీ నిధి నుంచి రూ.75 వేల రుణంగా పొందా. రూ.లక్షను సొంతంగా సమకూర్చా. ఇటుకలు, రింగులను తయారు చేస్తూ ప్రతినెలా దాదాపుగా రూ.40 వేల ఆదాయాన్ని పొందుతున్నా. పిల్లలను ప్రైవేట్ కళాశాలలో చదివిస్తున్నా. మరి కొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నా. -రాములమ్మ,
అర్వపల్లి గ్రామం, మాడ్గుల మండలం
స్వీట్ బాక్సుల తయారీకి అవసరమైన యంత్రాలను బ్యాంకు నుంచి లోన్ తీసుకుని కొనుగోలు చేశా. ప్రతిరోజూ స్వీట్లను తయారు చేసి విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నా. ప్రతినెలా రూ.50 వేల వరకు ఆదాయం వస్తున్నది. గౌరవంగా జీవిస్తున్నా. నేను వనిత స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని.
– అరుణ,నందిగామ మండలం
సుమ ఎంఎస్ స్వయం సహాయక సంఘానికి చెందిన నేను రూ.లక్షతో బట్టల షాపును ఏర్పా టు చేశా. ఇందుకోసం బ్యాంకు నుంచి రూ.75 వేలు, ఎస్వీఈపీ ద్వా రా రూ.9,591 రుణాన్ని పొందా. రూ. 15,409 సొంతంగా సమకూర్చా. ఈ బిజినెస్ బాగా జరుగుతున్నది. ప్రతినెలా రూ.25 వేల ఆదాయాన్ని పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నా. పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నా. బ్యాంకు రుణాలను సక్రమం గా చెల్లిస్తున్నా. నగరంలో 167 గజాల స్థలాన్ని కొనుగోలు చేశా.
జెల్ల జయలక్ష్మి , మాడ్గుల మండలం
ఎంబ్రాయిడింగ్ యూనిట్ ఏర్పాటు కోసం బ్యాంకు నుంచి లోన్ తీసుకుని కొనుగోలు చేశా. ప్రతినెలా దాదాపుగా రూ.12,000 పైనే ఆర్జిస్తున్నా. ఇద్దరి పిల్లలను చదివిస్తున్నా. 183 గజాల స్థలాన్ని కూడా కొన్నా. ప్రస్తుతం, జీవనోపాధి సులభతరమైంది. నేను ధనలక్ష్మి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని.
– చేవూరి స్వప్న, మాడ్గుల మండలం