షాద్నగర్టౌన్, జూలై 21: షాద్నగర్ పట్టణంలో పోచమ్మతల్లి బోనాలు వైభవంగా జరిగాయి. పోతరాజు ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురువారం మహిళలు, యువతులు బోనాలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. భక్తులతో పోచమ్మ దేవాలయం కిటకిటలాడింది. పటేల్రోడ్డు, నెహ్రూనగర్, వెంకటేశ్వర, భాగ్యనగర్, పద్మావతి, రతన్కాలనీ, తిరుమల, శ్రీనగర్కాలనీలో జోగినీల, పోతురాజుల విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారికి సమర్పించే తొట్టెల ఊరేగింపు అంగరంగవైభవంగా సాగింది. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ సరితాయాదగిరియాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్లు బచ్చలి నర్సింహ, శ్రీనివాస్, నాయకులు నారాయణరెడ్డి, జూపల్లి శంకర్, ఏజాజ్, దామోదర్, చెన్నయ్య, బల్లు, భాస్కర్ పాల్గొన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక..
నందిగామ, జూలై 21 : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొత్తూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ లావణ్యయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైసమ్మ బోనాల పండుగ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపాల్ వైస్ చైర్మన్ రవీందర్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, లక్ష్మయ్యయాదవ్, గోవిందురెడ్డి, హనుమంత్రెడ్డి, వెంకటేశ్, రాజేందర్గౌడ్, యాదయ్య, ప్రభాకర్రెడ్డి, రాఘవేందర్యాదవ్, శ్రీనివాస్చారి, శ్రవణ్, ఆంజనేయులు, విజయ్ పాల్గొన్నారు.