షాద్నగర్ రూరల్, జూన్ 18: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుతున్నాయి. ఏ గ్రామాన్ని చూసినా సుందరంగా కనిపిస్తున్నది. ఆహ్లాదాన్ని పెంచేలా రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు, పరిశుభ్రంగా సీసీ రోడ్లు, రాత్రివేళల్లో జిగేల్ అనిపించేలా వీధి దీపాలు, డంపింగ్ యార్డులు, ఇంటింటికీ భగీరథ నీటి సరఫరాతో ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ వచ్చింది. తెలంగాణ సర్కార్ ప్రతి గ్రామాన్ని, తం డాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తుండటంతో మారుమూల గ్రామీణ ప్రాంతాలు సైతం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి.
పల్లె ప్రగతితో అభివృద్ధి
ఫరూఖ్నగర్ మండలంలోని 47 గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం కింద ప్రతినెలా నిధులను విడుదల చేస్తుండటంతో సర్పంచ్లు ఆ నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. గతంలో ప్రగతికి దూరంగా ఉన్న గ్రామాలు సైతం నేడు పట్టణాలను తలపిస్తున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమాలతో మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుధ్యం, శిథిలావస్థకు చేరిన ఇండ్లు, కలుపు మొక్కల తొలగింపు వంటి అభివృద్ధి పనులతో ప్రతి గ్రామం మరింత సుందరంగా మారాయి. గ్రామాలు సరికొత్త శోభను సంతరించుకోవడంతో గ్రామాల్లోని ప్రజలు సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గ్రామానికి సరికొత్త శోభ..
షాద్నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో మా గ్రామం ఉంది. గత పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి దూరంగా ఉంది. పల్లె ప్రగతి కార్యక్రమంతో మా గ్రామం సరికొత్త శోభను సంతరించుకున్నది.
-నర్సింహులు, కమ్మదనం గ్రామ సర్పంచ్ ఫరూఖ్నగర్ మండలం
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి ..
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మల్ పురస్కార్ అవార్డును మా గ్రా మం సొంతం చేసుకుంది. తెలంగాణ సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహంతో మా గ్రామం మరింత అభివృద్ధి చెందింది. అభివృద్ధి పనులను చేపట్టడంలో స్థానికుల సహకారం మరువలేము.
-మౌనికామశ్చేందర్, హాజిపల్లి గ్రామ సర్పంచ్ ఫరూఖ్నగర్ మండలం
గ్రామం సుందరంగా మారింది
గతంలో మా గ్రామం అభివృద్ధికి దూరంగా ఉండేది. తెలంగాణ సర్కార్ ఏర్పడిన తర్వాతే గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గ్రామాల అభివృ ద్ధే లక్ష్యంగా సర్కార్ ప్రతినెలా నిధులను విడుదల చేస్తుండటంతో సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంతో మా గ్రామం మరింత సుందరంగా మారింది.
-జయశ్రీచంద్రశేఖర్, విఠ్యాల గ్రామ సర్పంచ్ ఫరూఖ్నగర్ మండలం
ఆదర్శ గ్రామంగా మారింది
తెలంగాణ ఏర్పాటు తర్వాతే గ్రామానికి మహర్దశ వచ్చింది. వివిధ రకాల అభివృద్ధి పనులతో ఆదర్శ గ్రామంగా మారింది. మండలంలోని ఇతర గ్రామాలకు మా గ్రామం ఆదర్శంగా ఉండడం సంతోషంగా ఉంది. -శ్రీశైలం, కిషన్నగర్ గ్రామ సర్పంచ్
ఫరూఖ్నగర్ మండలం
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
గతంలో మా గ్రామాన్ని ఎవరూ గుర్తు పట్టేవారు కాదు. ప్రభుత్వ నిధులు, స్థానికుల సహకారంతో మా గ్రామంలో వివిధ రకాల అభివృద్ధి పనులను పూర్తి చేశాం. నేడు మా గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలువడం సంతోషంగా ఉంది. తెలంగాణ సర్కార్కు రుణపడి ఉంటాం.
-మాధవి, చిల్కమర్రి గ్రామ సర్పంచ్ ఫరూఖ్నగర్ మండలం