చేవెళ్ల రూరల్, జూన్ 18 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతన్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఊరెళ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మర్పల్లి మాలతితో కలిసి ప్రారంభించారు.
దాదాపు రూ.23 లక్షల 27,800 వేల అంచనా నిధులతో వాటర్ లైన్ మరమ్మతులు, ఎలక్ట్రిసిటీ మరమ్మతుల నిర్వహణ, టాయిలెట్స్ మరమ్మతులకు పనులు ప్రారంభించి, డైనింగ్ హాల్ నిర్మాణం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ జహంగీర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, హెచ్ఎం గోపాల్, ఉపాధ్యాయులు రాజు, అక్బర్, కేపీ రెడ్డి, శ్రీశైలం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అరుణ్, ఉపాధ్యాయుడు పడాల ప్రవీణ్, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.