షాద్నగర్రూరల్, జూన్ 18 : ఫరూఖ్నగర్ మండలంలోని 47 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు సమావేశాలను ఏర్పాటు చేశారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వివిధ అభివృద్ధ్ది పనులను గ్రామస్తులకు వివరించారు. మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
పారిశుధ్య కార్మికులను సన్మానం
తుర్కయంజాల్ : పట్టణ ప్రగతి విజయవంతంలో పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది శ్రమ ఎంతో ఉందని మున్సిపాలిటీ కౌన్సిలర్ వేముల స్వాతి, కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి అన్నారు. పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులను సన్మానించారు. సిబ్బంది ఎంతో శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాలకు కొత్త శోభ
కడ్తాల్ : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో, పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి చదివి వినిపించారు. అనంతరం పారిశుధ్య కార్మికులను ప్రజాప్రతినిధులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యులు నరేందర్రెడ్డి, మహేశ్, మల్లయ్య, నాయకులు చందోజీ, జహంగీర్అలీ, రాంచంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
పనుల పరిశీలన
కొందుర్గు : కొందుర్గులో పల్లె ప్రగతి పనులను విశ్వనాథ్పూర్ ప్రత్యేక అధికారి వెంకటరమణ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడారు. గ్రామంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేశ్, గ్రామస్తులు ప్రకాశ్, గోపాల్, పద్మమ్మ, పెంటయ్య, యాదయ్య, ఇస్తారయ్య తదితరులు పాల్గొన్నారు.
సుందరంగా మున్సిపాలిటీ
షాద్నగర్టౌన్ : పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో షాద్నగర్ మున్సిపాలిటీ మరింత సుందరంగా మారిందని మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని పలువార్డుల్లో పారిశుధ్య పనులను శనివారం పరిశీలించారు. 15 రోజులుగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ సాయిబాబా, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కల పంపిణీ
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు పచ్చని కళ రావాలని చైర్పర్సన్ చెవుల స్వప్న అన్నారు. శనివారం 9వ వార్డులో కౌన్సిలర్ మురళీధర్రెడ్డి, 12వ వార్డులో కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. పొడి, తడి చెత్తపై ఆయా వార్డుల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణారెడ్డి, కమిషనర్ రామాంజులరెడ్డి, హెచ్ఎండబ్ల్యూస్ డీజీఎం రవీంద్రనాథ్వర్మ, మున్సిపల్ డీఈఈ అశోక్కుమార్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో మారుతున్న గ్రామాల రూపురేఖలు
నందిగామ : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. రంగాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను సర్పంచ్ రమేశ్గౌడ్తో కలిసి ఆయన పరిశీలించారు. గ్రామంలో నెల కొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
ముగిసిన పల్లె ప్రగతి
యాచారం : మండలంలో 15 రోజులుగా కొనసాగిన ఐదవ విడుత పల్లె ప్రగతి కార్యక్రమం శనివారంతో విజయవంతంగా ముగిసింది. మండలంలోని అన్నిగ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పల్లె ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన ప్రధాన సమస్యలపై చర్చించారు. గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని ప్రజాప్రతినిధులు కోరారు.
సిబ్బంది సేవలు మరువ లేనివి
చేవెళ్ల రూరల్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది సేవలు మరువలేనివని ఎంపీడీవో రాజ్కుమార్ తెలిపారు. ముడిమ్యాల గ్రామంలో సర్పంచ్ శేరి స్వర్ణలతతో కలిసి పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో పరిశీలించారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. అదేవిధంగా బస్తేపూర్లో సిబ్బందిని సర్పంచ్, కార్యదర్శి సన్మానించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రియాజుద్దీన్, పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు సన్మానం
నందిగామ : పల్లె ప్రగతి కార్యక్రమంలో కష్టపడి పని చేసిన చేగూరు గ్రామ పంచాయతీ కార్మికులను సర్పంచ్ మామిళ్ల సంతోష, వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలిసి సన్మానించారు. అభివృద్ధిలో వారి పాత్ర కీలకమన్నారు.
సిబ్బంది వల్లే విజయవంతం
శంకర్పల్లి : కార్మికుల వల్లే పట్టణ ప్రగతి విజయవంతమైందని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్ అన్నారు. కార్మికులను, మున్సిపల్ సిబ్బందిని సన్మానించారు. మండలంలోని మిర్జాగూడ, జనవాడ, మహారాజ్పేట్, గోపులారం గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలను నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ యాదగిరి, ఆయా గ్రామాల సర్పంచ్లు, కౌన్సిలర్ అశోక్, రాధ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
ముగిసిన పల్లె ప్రగతి పనులు
తలకొండపల్లి : ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రగతి పనుల్లో జాప్యం లేకుండా పనులు చేపట్టాలని ఎంపీడీవో రాఘవులు అన్నారు. మెదక్పల్లి, బల్సులపల్లి, ఖానాపూర్ గ్రామ పంచాయతీల్లో ఆయన పర్యటించారు. మొక్కలను పరిశీలించారు.
పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం
మొయినాబాద్ :గ్రామాభివృద్ధిలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని సర్పంచ్ సంధ్య అన్నారు. అజీజ్నగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం పారిశుధ్య కార్మికులకు సన్మానించింది. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దీపలత, మాజీ ఎంపీటీసీ మాణిక్రెడ్డి, ఏఈవో సునీల్కుమా ర్, నాయకులు శ్రీశైలం, నర్సింహారెడ్డి, తదితరులు ఉన్నారు.