పెద్దేముల్, జూన్ 7 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో మాట తప్పిందని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ అన్నారు. మంగళవారం పెద్దేముల్లో ఎస్సీ కుల వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కందనెల్లితండా నుంచి మారేపల్లి గ్రామం వరకు స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ.. బీజేపీ అధికారం చేపట్టి సుమారు 7 సంవత్సరాలు అవుతున్నా ఎస్సీ కులవర్గీకరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని, పూర్తిస్థాయిలో మాట తప్పిందని పేర్కొన్నారు. దీంతో పల్లెల్లో మాదిగలను చైతన్యపరచడానికి పాదయాత్రను చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎమ్మార్పీస్ సీనియర్ నాయకుడు స్వామిదాస్, ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి మల్లికార్జున్, ఎమ్మార్పీస్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.