పెద్దఅంబర్పేట, జూన్ 7: సీఎం కేసీఆర్ ప్రభు త్వం రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతి పైసా ఖర్చు చేసి ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నదని పేర్కొన్నారు. మం గళవారం ఆయన పట్టణ ప్రగతిలో భాగంగా పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలోని 17వ వార్డు ఆర్కేనగర్లో ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్రెడ్డి, సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నాచిరంజీవి, కౌన్సిలర్ కోటేశ్వర్రావుతో కలిసి బస్తీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొక్కలను నాటారు. ఇండ్ల పరిసరాల్లో మొక్కలు నాటిన పలువురిని సన్మానించారు. పెద్దఅంబర్పేట పట్ట ణ ప్రగతి నివేదికను విడుదల చేశారు. అనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మం చిరెడ్డి మాట్లాడుతూ ఆర్కేనగర్కు బస్తీ దవాఖానను ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలోనే ఇక్కడ డాక్టర్, ఇద్దరు నర్సులు, ఏఎన్ఎంలు ఉం టారని, ఇకపై అందరికీ మెరుగైన వైద్యం అందుతుందన్నారు.
మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో రోడ్డు మంజూరైందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి త్వరలో రూ.5 కోట్లు రానున్నట్లు తెలిపారు. మురుగునీటిని బయటకు పంపేందు కు అవసరమైన ట్రంక్లైన్ ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించామని, త్వరలోనే పనులు ప్రా రంభమవుతాయన్నారు. మున్సిపాలిటీలో రూ. 17.84 కోట్లతో వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఓపెన్ జిమ్లు తదితర పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. తట్టిఅన్నారం- మర్రిపల్లి రోడ్డు విస్తరణ పనులకు అటవీశాఖ నుంచి ఇబ్బందుల్లేకుండా చూడాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. ఇదే సాకుతో కాంట్రాక్టర్ పనులను చేయడంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. పది రోజుల్లో రోడ్డు వేయకపోతే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులకు కూడా తెలియకుండా ఆర్కేనగర్లో సమావేశం ఏర్పాటుచేయడంపై ఆయన అధికారులను ఆయన అభినందించారు.
సమస్యల గుర్తింపునకే.. పట్టణ ప్రగతి
సమస్యలను గుర్తించడమే పట్టణప్రగతి ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్రెడ్డి అన్నా రు. ఈ కార్యక్రమంలో భాగంగా సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను అందిస్తామన్నా రు. పట్టణాల్లో ప్రగతి పనులకోసం త్వరలోనే మరిన్ని నిధులను కేటాయిస్తామని, వీటితో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. అనంతరం సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ పరిశుభ్రత, పచ్చని వాతావరణమే పట్టణప్రగతి ఉద్దేశమని చెప్పారు. మొక్కలను సంరక్షించకపోతే అధికారులతోపాటు సామాన్యులపైనా చర్యలు ఉంటాయన్నారు.
పట్టణ ప్రగతి కింద మూడు విడుతల్లో పెద్దఅంబర్పేట మున్సిపాలిటీకి రూ.7.70 కోట్లు ఇవ్వగా.. అందులో రూ.5.5 కోట్లు ఖర్చు చేశారని, మరో రెండు కోట్ల పైచిలుకు నిధులు వెచ్చించాల్సి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు 58 బస్తీ దవాఖానలొస్తే.. ఎమ్మెల్యే మంచిరెడ్డి చొరవ తీసుకుని రంగారెడ్డి జిల్లాకే 22 తీసుకొచ్చారన్నారు. తెలంగాణ పచ్చదనానికి మారుపేరుగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రామాంజులరెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ జీఎం శ్రీధర్, డీజీఎం రవీంద్రనాథ్వర్మ, మున్సిపల్ డీఈఈ అశోక్, శివరామ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, అర్చన, రోహిణిరెడ్డి, పరశురాంనాయక్, హరిశంకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, దామోదర్, చిరంజీవి, విజయభాస్కర్రెడ్డి, విజేందర్రెడ్డి, రాములు, పవన్, సూరయ్య, భిక్షపతి, లింగం పాల్గొన్నారు.