హరితహారం కార్యక్రమంతో ఇప్పటికే పల్లెలు, పట్టణాలు పచ్చందాలను సొంతం చేసుకున్నాయి. ఊరు, వాడా పచ్చబడగా, పల్లె రోడ్లన్నీ పచ్చనిహారాల్లా మారిన విషయం తెలిసిందే. అయితే ఈసారి హరితహారం కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాలో 292.25 కిలోమీటర్ల మేర వివిధ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. మీటరుకుపైగా ఎత్తున్న మొక్కలను గ్రామ నర్సరీల్లో సిద్ధం చేస్తున్నారు. జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీ రోడ్ల వెంట కిలో మీటరుకు ఒక వరుసలో 666 మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ ఏడాది 3.52 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మొక్కనూ సంరక్షించే పూర్తి బాధ్యత గ్రామపంచాయతీదేనని జిల్లా యంత్రాంగం పేర్కొంటు
పరిగి, మే 24 : రోడ్ల పక్కన మొక్కల పెంపకంతో పచ్చందాలు పరుచుకునేలా తయారుచేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇందులోభాగంగా ఈసారి హరితహారంలో రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని 292.25 కి.మీ వివిధ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్ల వెంట మొక్కల పెంపకానికి ఈసారి ప్రాధాన్యత ఇవ్వడంతో పెద్ద మొక్కలు నాటడం కోసం అన్ని రకాల చర్యలను అధికారులు చేపట్టారు. జిల్లా పరిధిలో ఎంపిక చేసిన ఈ రహదారుల్లో ఈసారి మొత్తం 3,52,000 మొక్కల పెంపకానికి అధికారులు చర్యలు చేపట్టారు.
జిల్లాలో 292.25 కి.మీ మేర రోడ్ల పక్కన మొక్కలు
హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈసారి వికారాబాద్ జిల్లా పరిధిలో 292.25 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కన ఇరువైపులా మొక్కలు నాటనున్నారు. ఇందులో జాతీయ రహదారులు 29 కి.మీ, ఆర్అండ్బీ 190.25 కి.మీ, పంచాయతీరాజ్ 73 కి.మీ మేర రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటేందుకు నిర్ణయించారు. జిల్లాలోని బంట్వారం మండలంలోని 4 గ్రామపంచాయతీల పరిధిలో 6 కి.మీ, బషీరాబాద్లో 11కు 12, బొంరాస్పేట్లో 13కు 36, ధారూర్లో 5కు 14, దోమలో 6కు 11, దౌల్తాబాద్లో 5కు 7, కొడంగల్లో 4కు 12, కోట్పల్లిలో 12కు 12, కులకచర్లలో 8కి 28, మర్పల్లిలో 3కు 9, మోమిన్పేట్లో 28కి 50, నవాబుపేట్లో 26కు 28, పరిగిలో 13కు 9.75, పెద్దేముల్లో 14కు 10.5, పూడూరులో 14కు 10.5, తాండూరులో 2కు 3, వికారాబాద్లో 6కు 6, యాలాల్లో 14 గ్రామపంచాయతీల్లో 18.5 కిలోమీటర్ల మేర మొక్కలు నాటేందుకు నిర్ణయించారు.
రోడ్డుకు ఇరువైపులా.. రెండు వరుసల్లో 3.52లక్షల మొక్కలు
హరితహారంలో భాగంగా ఈసారి ప్రాధాన్యతా క్రమంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల్లో.. ఒక వరుసలో చిన్న, పూల మొక్కలు, రెండో వరుసలో మద్ది, కదంబ తదితర పెద్ద మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం గుంతలు తవ్వించే పనులు కొనసాగుతున్నాయి. అధికంగా స్థలం ఉంటే మూడు వరుసల్లో సైతం మొక్కలను పెంచుతారు. మేకలు మేయకుండా ఎత్తుగా ఉండే పెద్ద మొక్కలను నాటనున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఒక్కో వరుసలో అయితే 666 మొక్కలు, రెండు వరుసల్లో 1300 మొక్కలను పెంచుతారు. జిల్లా పరిధిలో ఎంపిక చేసిన 292.25 కిలోమీటర్ల రోడ్ల పక్కన 3.52లక్షల మొక్కలను నాటనున్నారు. జిల్లాలోని అటవీ శాఖ వారి నర్సరీల్లో ఉన్న పెద్దమొక్కలు, గ్రామపంచాయతీ నర్సరీల్లో ఉన్న మొక్కలను వినియోగించనున్నారు. మరింత పెద్ద మొక్కలు అవసరమైతే ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించిన గ్రీన్ బడ్జెట్లో నుంచి నిధులు వెచ్చించి కొనుగోలు చేస్తారు. గుంతలు తీయడం, మొక్కలు నాటించడం వరకు ఉపాధి హామీలో చేపట్టనుండగా.. మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణ బాధ్యత పూర్తిగా ఆయా గ్రామపంచాయతీలకే అప్పగిస్తారు. రోడ్ల పక్కన నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. మొక్కలు బతకడానికి ఆయా గ్రామపంచాయతీల్లో వినియోగిస్తున్న ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తారు. నాటిన ప్రతి మొక్క సంరక్షింపబడితే రెండుమూడు సంవత్సరాల్లో రోడ్లన్నీ పచ్చందాలతో కనువిందు చేస్తాయి. దీంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణం సాగించవచ్చు.
న్నది.
జిల్లాలో 292.25 కి.మీ మేర రోడ్ల పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్
– కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా
హరితహారంలో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో జిల్లాలో 292.25 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కన 3.52లక్షలు మొక్కలను నాటాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి గుంతలను తవ్వించే పనులు కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసి మొక్కలను నాటడం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీలో గుంతలను తీసి, మొక్కలను నాటించనుండగా.. మొక్కల సంరక్షణ బాధ్యత గ్రామపంచాయతీలకు అప్పగించనున్నాం. నాటిన ప్రతి మొక్కను బతికించడం ద్వారా రోడ్లకు ఇరువైపులా పచ్చటి అందాలు సంతరించుకుంటాయి.