వికారాబాద్, మే 24 : ఉద్యోగి సేవలే ప్రజల్లో ఎల్లకాలం గుర్తుంటాయని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పేర్కొ న్నారు.. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో తాండూరు డీఎస్పీగా సేవలు అందించి డీజీపీ కార్యా లయానికి బదిలీ అయిన లక్ష్మీనారాయణకు వీడ్కోలు, ఖమ్మం జిల్లా నుంచి బదిలీ అయి తాండూరుకు వచ్చిన శేఖర్గౌడ్కు స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డీఎస్పీ లక్ష్మీనారాయణ తాండూరు ప్రజలకు చాలా సేవలు అందించారన్నారు. ముఖ్యమైన కేసుల్లో డీఎస్పీ ముఖ్యపాత్ర పోషించి ఛేదించారని గుర్తు చేశారు. ప్రతి ఉద్యోగికి బదిలీ సాధారణమని, ఎక్కడికి వెళ్లినా ప్రజా సేవే అంతిమ లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అనంతరం తాండూరు డీఎస్పీని సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్, వికారా బాద్ డీఎస్పీ సత్యనారాయణ, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఆర్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తాండూరు, మే 24: తాండూరు డీఎస్పీగా శేఖర్గౌడ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సం దర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతామన్నారు. నిషేధిత గుట్కా, మట్కా, పేకాటతో పాటు అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతామన్నారు. స్థానిక సిబ్బంది, నేతలు, ప్రజలతో తాండూరు డివిజన్ గురించి అవగాహన చేసుకొని ఎల్లప్పుడూ అందరికి అందుబాటులో ఉంటామన్నారు. డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న శేఖర్గౌడ్కు తాండూరు పట్టణ సీఐ రాజేందర్రెడ్డి, రూరల్ సీఐ రాంబాబుతో పాటు నియోజకవర్గంలోని ఎస్సైలు పూలబొకే అందజేసి సెల్యూట్ చేస్తూ స్వాగతం పలికారు.
తాండూరు డీఎస్పీగా 2019 అక్టోబర్ 30న బాధ్యతలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు చక్కగా సేవలను అందించిన డీఎస్పీ లక్ష్మీనారాయణకు తాండూరు డివిజన్ పోలీస్ శాఖతో పాటు నేతలు, అధికారులు, ప్రజలు, అభిమానులు నేషనల్ గార్డెన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పలువురు వారి సేవలను గుర్తు చేశారు.