షాబాద్, మే 5 : రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నట్లు జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని సర్దార్నగర్ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్నారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతు బిడ్డగా రైతును రాజు చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, మార్కెట్ వైస్ చైర్మన్ డప్పు రాజు, ఏవో వెంకటేశం, సర్పంచులు మునగపాటి స్వరూప, నరేందర్రెడ్డి, ఎంపీటీసీ వనిత, మార్కెట్ కార్యదర్శి రవికుమార్, నాయకులు నర్సింహారెడ్డి, దయాకర్చారి, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
షాద్నగర్రూరల్, మే 5 : రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని మండల వ్యవసాయాధికారి నిశాంత్కుమార్తో కలిసి బుధవారం పరిశీలించి మాట్లాడారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, దళారుల చేతుల్లో మోసపోవద్దని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,888 మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు.
ధాన్య శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశాం..
రైతులు వర్షాలు కురుస్తాయనే భయంతో ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్నారని మార్కెట్ యార్డు ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండ ఉండేందుకు మార్కెట్ యార్డులోనే ధాన్య శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశామని వివరించారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
కేశంపేట, మే 5 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నారు. కొత్తపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తున్నదని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, సర్పంచ్ నవీన్కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీధర్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు.