ధారూరు, మే 19: ధారూరు మండల పరిధిలోని గురుదోట్ల, ఊరివెనుక తండా, బిల్యానాయక్ తండాల్లో ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుదోట్ల గ్రామంతోపాటు ధా రూరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అధి కారులను ఆదేశించారు. గ్రామంలో పూడుకు పోయిన చెరువు కా లువ పూడి క తీతపనులను తక్షణమే చేపట్టాలన్నారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పాత పాఠశాల భవనాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నారు.
గురుదోట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఊరెనకతండాకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.ఊరెనక తండాలోని మిషన్ భగీరథ మంచినీటిని ట్యాంక్లో నీటిని నింపుతూ… రెండు తండాలకు సరిపడ నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రతీ గురువారం పశువుల డాక్టర్ అందుబాటులో ఉం డాలని పశువైద్య అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, ఓల్టేజ్ సమస్య ఉందని కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలన్నారు. ఇండ్లపై, పంటపొలాల్లో వేలాడుతున్న కరెంటు తీగలను సరి చేసి, బాల్యానాయక్ తండాలో నిరుపయోగంగా ఉన్న స్థంభాలను తొలగించి, కొత్తలైన్ ఏర్పాటు చేయాలన్నారు.
పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. గురువారం ధారూరు మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన 210మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో బాల్యవివాహాలు తగ్గాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో ధారూరు ఎంపీపీ జైదుపల్లి విజ యలక్ష్మి, ధారూరు జడ్పీటిసీ కోస్నం సుజాత, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, ధారూరు తహసీల్దార్ బీమయ్య గౌడ్, రైతు బంధు సమితి మం డల అధ్య క్షుడు ఎస్.వెంకటయ్య, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.