ఇబ్రహీంపట్నం, ఏప్రిల్21: నియోజకవర్గ పరిధిలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. గంటపాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలం అయ్యింది. అకాల వర్షం రైతు లకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఇబ్రహీం పట్నంలో భారీ వర్షంతో వర్షం నీరు రోడ్లపై ఏరులై పారింది. దీంతో సాగర్హ్రదారికి ఇరువైపులా తాత్కాలిక దుకాణాలు ఏర్పరుచుకున్న చిరువ్యాపారులు ఇబ్బందులకు గుర య్యారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గాలివానతో కూడిన వర్షానికి అక్కడక్కడ విద్యుత్ తీగలు తెగిపో వడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మంచాల మండలంలో..
మంచాల ఏప్రిల్21: మంచాల మండలం ఆగపల్లి, కా గజ్గట్, నోముల తదితర గ్రా మాల్లో ఉరుములు మె రుపులతో వడగండ్ల వర్షం కురవడంతో వరి, కూరగా యల పంటలకు నష్టం వాటిల్లింది.
యాచారంలో..
యాచారం ఏప్రిల్21: యాచారం మండలంలోనూ పలు గ్రామాల్లో ఈదురుగాలలతో కూడిన వర్షం కురిసింది. దీంతో అక్కడక్కడ విద్యుత్కు అంతరాయం నెలకొంది. ఒక్క సారిగా చల్లని గాలులతో వర్షం కురవడంతో ఎండ, వేడిమి నుంచి ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు.
అబ్దుల్లాపూర్మెట్లో..
అబ్దుల్లాపూర్మెట్ ఏప్రిల్21: అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో ఒక్కసారిగా వాతా వరణం చల్లబడి భారీగా వర్షం కురిసింది. దీంతో కొన్ని చోట్ల ఈదు రు గాలులకు విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు నెలకొరిగాయి. విద్యార్థు లు, ప్రయాణికులు సుమారు గంట పాటు వర్షం కురు వడంతో ఎక్కడికక్కడే నిలిచిపోచారు.
మొయినాబాద్లో..
మొయినాబాద్, ఏప్రిల్21: నాగిరెడ్డి గూడ లోని ప్రభుత్వ పాఠశాల ప్రహరి పక్కన ఆటో ట్రాలీ పా ర్కింగ్ చే యడం తో చెట్ల కొమ్మలు విరిగి ఆటో ట్రాలీ మీద పడింది.
పెద్దఅంబర్పేట, ఏప్రిల్ 21: అకాల వర్షం కారణంగా అనుమతులు లేని అపార్ట్మెంట్ ప్రహరీ కూలి పక్కనే ఉన్న మరో ఇంటిపై పడడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా అందులో ఉన్న ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయ ప డింది. వెంటనే స్థానికులు ఆమెను దవాఖానకు తర లిం చి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు చెరుకూరి రేణుక, జగన్ బాధి తురాలిని పరామర్శించారు.
కొత్తూరు రూరల్, ఏప్రిల్ 21: పిడుగుపాటుకు మం డలంలోని శేరిగూడబద్రాయపల్లి గ్రామ రైతు అమ్రలిం గానికి చెందిన ఎద్దు, రైతు రాసుల ఆంజనేయులుకు చెందిన ఆవు మృతి చెందాయి.