షాద్నగర్టౌన్, మే27: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణానికి చెందిన మహ్మద్ పాషాకు మంజూరైన రూ. 3 లక్షల ఎల్వోసీ చెక్కును శుక్రవారం లబ్ధిదారుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపద సమయంలో ఉన్నవారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీఎం సహాయనిధితో ప్రైవేట్ దవాఖానల్లో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందన్నారు. పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ ప్రతాప్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు గౌస్జానీ, నాయకులు చెట్ల నర్సింలు పాల్గొన్నారు.
కొందుర్గు, మే 27 : కొందుర్గు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పర్యటించనున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంతో పాటు చెర్కుపల్లి, విశ్వనాథ్పూర్, ఆగిర్యాల, తంగెళ్లపల్లి, రేగడిచిల్కమర్రి, ముట్పూర్, ఉత్తరాశిపల్లి, టేకులపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.