ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పల్స్పోలియో కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 98.3శాతం పల్స్ పోలియో కార్యక్రమం పూర్తి కాగా, వికారాబాద్ జిల్లాలో 92 శాతం పూర్తైంది. మంత్రి సబితాఇంద్రారెడ్డి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలుచోట్ల పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 1551 పల్స్ పోలియో కేంద్రాల్లో 3,92,943 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా, 3,86,323 మంది చిన్నారులకు చుక్కలు వేశారు. ఇందుకు గాను 6204 మంది వైద్య సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా బూత్ల వారీగా 82,919 మందికి, బహిరంగ ప్రదేశాల్లో 1,882 మందికి, మొబైల్ టీంలతో 1,302 మంది కాగా, మొత్తం 86,103 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో కార్యక్రమం విజయవంతమైంది.
పరిగి, ఫిబ్రవరి 27 : పుట్టిన శిశువు నుంచి ఐదేండ్ల లోపు వారందరికీ పోలియో చుక్కలు వేయించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. ఆదివారం పరిగి లోని సర్కారు దవాఖానలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజంగా మారుద్దామని చెప్పారు. పోలియో మహమ్మారిని పూర్తి స్థాయిలో నివారించేందుకు ప్రభుత్వం పల్స్పోలియో కార్యక్రమం చేపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కె.ప్రసన్నలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే పరిగి డివిజన్ పరిధిలో ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బూత్లు ఏర్పాటుచేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పరిగిలో ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ బి. హరిప్రియ, కులకచర్లలో జడ్పీటీసీ రాందాస్, ఎంపీపీ సత్యమ్మ, దోమలో సర్పంచ్ రాజిరెడ్డి, పూడూరులో వైద్యాధికారి, ఆయా గ్రామాల్లో సర్పంచ్లు పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
తాండూరు, ఫిబ్రవరి 27: తాండూరు నియోజకవర్గంలో పల్స్పోలియో విజయవంతంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యసిబ్బంది పాల్గొని చిన్నారులకు ఉత్సాహంగా పోలియో చుక్కలను వేశారు. మిగిలిన వారికి నేడు, రేపు కూడా పంపిణీ చేస్తామని వైద్యసిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, యాలాల ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, బషీరాబాద్ ఎంపీపీ కరుణతో పాటు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, విద్య, వైద్యానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుండడంతో పేదలకు కార్పొరేట్ స్థాయిలో అందే చికిత్సలు ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా అందుతున్నాయన్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 27: వికారాబాద్ పట్టణంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే ఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప చిన్నారులకు పల్స్పోలియో చుక్కలు వేశారు. వీరితో పాటు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్ సురేశ్ పోలియో చుక్కలు వేశారు. అదే విధంగా ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వికారాబాద్ ఎంపీడీవో సత్తయ్య గొట్టిముకల గ్రామంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
కొడంగల్, ఫిబ్రవరి 27: నిండు జీవితానికి రెండు చుక్కలు ఎంతో మేలు చేస్తాయని డిప్యూటీ డీఎంహెచ్వో డా.రవీంద్రయాదవ్ అన్నారు. ఆదివారం కొడంగల్ నియోజకవర్గం లోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రధాన కూడలి, బస్టాండ్ తదితర ప్రాం తాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. బొంరాస్పేట మండలంలో నందార్పూర్ గ్రామంలో డిప్యూటీ డీఎంహెచ్వో చిన్నారులకు పోలియో చుక్కలను వేయగా, కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, దౌల్తాబాద్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో జడ్పీటీసీ కోట్ల మహిపాల్ చిన్నారులకు పోలియో చుక్కలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మూడు మండలాల పరిధిలో 17వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించే లక్ష్యంగా ఉందన్నారు. ఇందుకు గాను 140బూత్లను ఏర్పాటు చేసి 560 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. మొదటి రోజే విజయవంతంగా 95శాతం లక్ష్యాన్ని పూర్తి చేసి నట్లు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఇంటింటికీ తిరిగి ఆశ, అంగన్వాడీ, ఏఎన్ఎంల చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. చిన్నారులకు పోలియో చుక్కలను వేయించే బాధ్యత వారి తల్లిదండ్రులదేనన్నారు.