షాద్నగర్, ఫిబ్రవరి 27 : నియోజకవర్గంలోని అన్ని గిరిజన తండాల్లో సీసీ రోడ్లు ఉన్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని సంత్ సేవాలాల్ దేవాలయ ఆవరణలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో గిరిజనులు ముందున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించారన్న విషయాన్ని గిరిజనులు గుర్తించాలని కోరారు. సంత్ శ్రీ సేవాలాల్ గొప్ప మానవత వాది అని, అహింసా మార్గంలో పయనించి గిరిజనులను చైతన్యం చేసేందుకు తన వంతు కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. గిరిజన సంప్రదాయ ప్రకారం సంత్ శ్రీ సేవాలాల్ చిత్రపటం వద్ద పూజలు నిర్వహించారు. కళాకారులు తమ ఆటాపాటలతో సంత్ శ్రీ సేవాలాల్ గొప్పతనాన్ని చాటారు. వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్తో పాటు ఆర్డీవో రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, గిరిజన ప్రముఖ నాయకులను ఉత్సవ కమిటీ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల, స్వరూప, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబాల్నాయక్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మిట్టునాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, పలు పార్టీల గిరిజన నాయకులు, అధికారులు, తండాల గిరిజన ప్రజలు పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : సీఎం సహాయనిధి నిరుపేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ ఇస్తాంపూర్కాలనీకి చెందిన జహంగీర్కు రూ.60 వేలు, పటేల్రోడ్డుకాలనీ చెందిన చెన్నయ్యకు రూ.16 వేల సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. పేద ప్రజలకు సీఎం సహాయనిధి వరంలా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, కేశంపేట జడ్పీటీసీ విశాల, కౌన్సిలర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు ఏజాజ్ పాల్గొన్నారు.