కొడంగల్, ఫిబ్రవరి 24: కొడంగల్ అభివృద్ధికి మరో పది కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్డ్రైన్స్ను ప్రా రంభించారు. ఈ సందర్భంగా 6వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో కొడంగల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా రూ.15కోట్లు మం జూరు కాగా రూ.13 కోట్ల పనులు పూర్తి అయ్యాయని మిగిలిన రెండు కోట్ల మేర పనులను త్వరలోనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొడంగల్ మున్సిపాలిటీని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ భవనం లేనం దున రూ.కోటి నిధులు కేటాయించేందుకు ప్రతిపాదన చేపడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా కొడంగల్ పెద్ద చెరువు కట్ట మరమ్మతు, పార్క్ తదితర పనుల నిర్మాణాలకు ఎస్టిమేషన్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ. మూడుకోట్లు, రూ.80లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణం, 12 అంగన్వాడీ భవన నిర్మాణాలకు రూ.15లక్షలు మంజూరైనట్లు తెలిపారు. 50 పడకల దవాఖాన భవనాన్ని పరిశీలించి త్వరలో మంత్రి హరీశ్రావుతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూదన్యాదవ్, డా. శ్రీలతాయాదవ్, వెంకట్రెడ్డి, రమేశ్, కోఆప్షన్ సభ్యు లు శారదమ్మ, మునీరోద్దిన్లతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.