కొందుర్గు, మార్చి 10 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లాల్పహాడ్లో ఎస్ఎస్ గార్డెన్లో జడ్పీటీసీ స్వరూప ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులకు సన్మానం చేశారు. మహిళలతో కలిసి ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో మహిళలకు పెద్ద పీట వేశారని అన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సీడీపీవో నాగమణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, మోత్యానాయక్, రాములు, ప్రేమ్కుమార్, బాబురావు, నర్సింగరావు, జబ్బార్ పాల్గొన్నారు.