తాండూరు, ఫిబ్రవరి 27: ప్రజా సమస్యలను త్వరగా తెలుసుకునేందుకు, ఇంట్లో నుంచే అతి సులభంగా అధికారుల దృష్టికి ప్రజలు సమస్యలను చేర వేసేందుకు తాండూరు నియోజకవర్గం ప్రజలకోసం ‘ప్రజాబంధు’ ప్రత్యేక యాప్ను రూపొందించి ఆవిష్కరించినట్లు తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తెలిపారు. ఆదివారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కల్యాణమండపంలో ప్రజాబంధు యాప్ ఆవిష్కర ణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ యాప్ను డౌన్లోన్ చేసుకునే విధానంతో పాటు సమస్య ఏదైనా యాప్ను ఉపయోగించి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గల ప్రక్రియను ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. యాప్ టెక్నికల్ టీంతో పాటు క్షేత్రస్థాయిలో ఈ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు నియమించిన కో-ఆర్డినేటర్లను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మా ట్లాడుతూ సమస్య ఏదైనా సరే త్వరగా పరిష్కరించేందుకు ప్రజాబంధు యాప్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల వెళ్లే అవసరం లేకుండానే అధికారులకు సమస్యలను తెలిపేందుకు ఈ యాప్ను ఆవిష్కరించిన ట్లు తెలిపారు. ఈ యాప్ వ్యవస్థను సక్రమంగా నడిచేందుకు నియోజకవర్గంలోని ప్రతి 10 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి కో-ఆర్డినేటర్లను నియమిం చినట్లు వెల్లడించారు. ఈ యాప్ను నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని తమ ప్రాంత సమస్యలను తెలపాలన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖ అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరిస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తాండూరు అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం తన సొంత డబ్బుతో ఈ యాప్ను రూపొందించి, నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని స్థానిక ప్రజలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
తాండూరు, ఫిబ్రవరి 27: మానవ సేవే మాధవ సేవ అని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సత్యసాయి మం దిరంలో నిర్వహించిన రుద్రాభిషేకం, రహభర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమంలో, పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రహభర్ ఫౌండేషన్ నిర్వాహకులు నిరుపేదలకు ఉచితంగా తోపుడు బండ్లు, వివిధ వస్తువులను అందించడం అభినందనీయమన్నారు. వీరశైవ సమాజాభివృద్ధికి, రుద్రభూమిలో పలు వసతుల కల్పనకు రూ.15 లక్షలను ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమాల్లో సత్యసాయి, వీరశైవ సమాజం, రహభర్ ఫౌండేషన్ ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.