ఆమనగల్లు, జూలై 17: తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆది నుంచి వివక్ష చూపుతున్నదని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథం అన్నారు. ఆమనగల్లు పట్టణంలో ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ వస్పు ల జంగయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు. త్వరలో జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీలతో కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులపై ప్రస్తావిస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా రాష్ర్టాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించా రు. రాజ్యాంగం ప్రకారం రాష్ర్టాలకు పన్నుల రూపంలో 40 శాతం నిధులు రావాల్సి ఉండగా కేవలం 27శాతం మాత్రమే చెల్లిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు టీఆర్ఎస్పై విషప్రచారం చేస్తున్నారని మం డిపడ్డారు. ప్రధాని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారి ప్రజ ల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కేంద్రంలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
అంతకుముందు హైదరాబాద్లో టీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డి మంద జగన్నాథంను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో కడ్తాల్ జడ్పీటీసీ దశరథ్నాయక్, టీఆర్ఎస్ నాయకులు మహేశ్, శ్రీను, శివలింగం, వెంకట్ రెడ్డి, రాము, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.