రంగారెడ్డి, ఫిబ్రవరి 17,(నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మరింత బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా కూడా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాటు స్వల్పకాలిక వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది. మహి ళా సంఘాల సభ్యులు కిరాణా షాపుల నిర్వహణకు, గేదెలు, గొర్రెలు, మేకల కొనుగోలుకు, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు అధికంగా రుణాలను తీసుకుంటున్నారు. అయితే జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాల సభ్యులకు రూ.562 కోట్ల వడ్డీలేని రుణాలను అందించాలని ప్రభు త్వం లక్ష్యంగా పెట్టుకోగా… ఇప్పటివరకు 98 శాతానికిపైగా రుణాలను వారికి ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధం గా గతేడాది రూ.314 కోట్ల రుణాలను అందించాలని నిర్ణయించగా లక్ష్యానికి మించి రూ.320 కోట్ల రుణాలను బ్యాం కర్లు ఎస్హెచ్జీలకు మంజూరు చేశారు. అయితే జిల్లావ్యాప్తంగా 19,932 స్వయం సహాయక సంఘాలుండగా అందు లో 2,25,020 మంది సభ్యులు ఉన్నారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను ఎప్పటికప్పుడు చెల్లించి తిరిగి పొందుతుండటంతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వారికి అధికంగా ప్రాధాన్యమిస్తూ ఆర్థికంగా బలోపేతం అయ్యేలా తోడ్పాటునందిస్తున్నారు. అయితే జిల్లాలో 99 శా తం స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలను పొంది గడువు తేదీలోపే చెల్లిస్తున్నారు. కాగా 559 ఎస్హెచ్జీలు మాత్రమే పనిచేయని సంఘాలుగా డీఆర్డీఏ అధికారులు గుర్తించారు. అయితే ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం 98.84 శాతం రుణాలను మంజూరు చేసింది. రూ. 562 కోట్లను చెల్లించాలని లక్ష్యంగా నిర్దేశిం చుకోగా ఇప్పటివరకు రూ.555.86 కోట్ల రుణాలను ఎస్హెచ్జీలకు అందజేసింది. కాగా జిల్లాలోని 12 మండలాల్లో 100 శాతానికి మించి రుణాలు మంజూరయ్యాయి. శంకర్పల్లి మండలంలో 116 శాతం, నందిగామలో 107 శాతం, కొత్తూరులో 103 శాతం, మాడ్గులలో 103 శాతం, చౌదరిగూడెంలో 103 శాతం, శంషాబాద్లో 101 శాతం, కందుకూరులో 101 శాతం, మొయినాబాద్లో 101.38 శాతం, చేవెళ్లలో 101.28 శాతం, మంచాలలో 101.11 శాతం, కడ్తాల్లో 100.93 శాతం, అబ్దుల్లాపూర్మెట్లో 100.80 శాతం మేర మహిళా సంఘాల సభ్యులు రుణాలను పొం దారు. అదేవిధంగా మిగతా మండలాల్లోనూ 90 శాతానికిపై గా ఎస్హెచ్జీలకు రుణాలు మంజూరయ్యాయి. ఒక్క మహేశ్వరం మండలంలోనే 84 శాతం మేర మహిళా సంఘాల సభ్యులకు రుణాలు మంజూరయ్యాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేసేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎన్పీఏ(పనిచేయని సంఘాలు)లకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 559 సంఘాలుండగా రూ.7.89 కోట్ల రుణాలు సంబంధిత సంఘాల నుంచి వసూలు చేయాల్సి ఉంది. అయితే అత్యధికంగా మొయినాబాద్ మండలంలోని 202 సంఘాల నుంచి రూ. 1.26 కోట్ల రుణాలు, యాచారం మండలంలోని 101 సంఘాల నుంచి రూ.80.14 లక్షలు, చేవెళ్ల మండలంలోని 96 సంఘాల నుంచి రూ.84.43 లక్షలు, శంషాబాద్ మండలంలోని 64 సంఘాల నుంచి రూ.1.20 కోట్లు, షాబాద్ మండలంలోని 17 సంఘాల నుంచి రూ.78.46 లక్షలు, కం దుకూరు మండలంలోని 15 సంఘాల నుంచి రూ.69.01 లక్షల రుణాలను వసూలు చేయాల్సి ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు వంద శాతం రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఇప్పటివరకు 98 శాతానికిపైగా రుణాలను మంజూరు చేసిన దృష్ట్యా లక్ష్యానికి మించి రుణాలను మంజూ రు చేస్తాం. అన్ని మండలాల్లోనూ వంద శాతం రుణాల మం జూరుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు.
– కె.జంగారెడ్డి, డీఆర్డీవో ఏపీడీ