మొయినాబాద్, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం చిలుకూరు గ్రామంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నారు. స్వామి వారి మెడ లో ఉన్న వస్ర్తాలు, పండ్లు, పూలు స్వామివారి సన్నిధిలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి అనంతరం వాటిని సీఎం కేసీఆర్కు అందజేయాలని ఆలయ అర్చకులు గోపాలకృష్ణస్వామి, రంగరాజన్ చేవెళ్ల ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని సుందరేశ్వరస్వామి ఆలయంలోనూ సీఎం కేసీఆర్ పేరున వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, వెంకట్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు నరోత్తంరెడ్డి, అర్జున్, రాఘవేందర్యాదవ్, రాజు, వెంకటేశ్ పాల్గొన్నారు.