తాండూరు రూరల్, ఫిబ్రవరి 11: తాండూరు మండలంలోని ఓగిపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్తమైసమ్మ ఆలయ ప్రారంభంతోపాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, అదేవిధంగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనతోపాటు ధ్వజస్తంభాన్ని శుక్రవారం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు. స్థానికులతోపాటు కరణ్కోట గ్రా మం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్య హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ పద్మమ్మ, మాజీ సర్పంచ్ బసంత్రావు పటేల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. అదేవిధంగా కర్ణాటక రాష్ర్టానికి చెందిన భక్తులు కూడా అధిక సంఖ్య హాజరయ్యారు.