కడ్తాల్, జూలై 21 : వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని రావిచేడ్ గ్రామంలో జరిగింది. ఘటనకి సంబంధించి స్థానికులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన చేగూరి నర్సింహకు చెందిన గొర్రెలను బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద గొర్ల పాకలో ఉంచి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం పొలం వద్ద వెళ్లి చూడగా 20 గొర్రెలు చనిపోయాయి. వీధి కుక్కల దాడిలో గొర్రెలు చనిపోయినట్లు నర్సింహ ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్ వేర్వేరుగా రావిచేడ్ గ్రామానికి చేరుకొని మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత రైతును పరామర్శించి రూ.5 వేలు, రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ తరుఫున జడ్పీటీసీ రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. వారి వెంట సర్పంచ్ భారతమ్మ, ఉప సర్పంచ్ వెంకటేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రమేశ్యాదవ్, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు భాస్కర్రెడ్డి, చందోజీ, హన్మానాయక్, రంగయ్య, నరేశ్నాయక్, జమీర్, యాదయ్య, జహంగీర్అలీ, జమీర్, లింగం, భిక్షపతి, సాయికుమార్, రమేశ్, రాజు, రాంచంద్రయ్య, శంకర్, రవి, రాములు, మండల పశువైద్యాధికారి బానునాయక్ పాల్గొన్నారు.