సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): పై విధంగా విపరీతమైన కోపతాపాలతో కొన్ని వర్గాల్లోని కుటుంబాలు సతమతమవుతున్నాయి. ఒకరిపై మరొకరు ద్వేషాన్ని పెంచుకుని ఏండ్ల తరబడిగా సజావుగా సాగుతున్న సంసార జీవితాన్ని తెంపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. చిన్న, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుని అనాలోచిత కోపాన్ని చూపుతు న్నారు. ఎవరు చెప్పినా వినడం లేదు. సర్దుకుపోవాలనే ఆలోచనే లేదు. దీంతో మానసికంగా కృంగిపోతున్నారు.
నెలల తరబడి ఇంట్లోనే..
కరోనా, లాక్డౌన్ సందర్భంలో నెలల తరబడి ఇంట్లోనే ఉండటం, ఆ తర్వాత వర్క్ఫ్రం హోం పద్ధతి రావడంతో చాలా మంది ఉద్యోగులైన భార్యాభర్తలు 24 గంటల పాటు ఇండ్లల్లోనే ఉన్నారు. అంతకుముందు ఇరువురు ఉద్యోగాలకు వెళ్లడంతో చాలా తక్కువ సమయమే ఇద్దరూ కలిసి గడిపేవారు. ఈ క్రమం లో వారి మధ్య అన్యోన్యత బాగానే ఉండేది. కానీ.. తాజాగా అధిక సమయం పాటు ఇండ్లల్లో ఉండటం.. ఇంట్లోని పనిని షేర్ చేసుకోమనడం, వాట్సాప్ చాటింగ్లు, తదితర అంశాలకు సం బంధించిన వ్యవహారాలను కొత్తగా చూస్తుండటంతో విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు కరోనా దెబ్బతో ఒకరి ఉద్యోగం పోవడం, మరొకరి వేతనంలో కోత పడటం, అప్పటివరకు అనుభవించిన విలాసాలు తగ్గడంతో చాలామంది ఉద్యోగులు, వ్యా పారులు, కూలీలు ఇంకా అనేక వర్గాల ప్రజల్లో అసహనం పెరిగిపోయి ఓపిక తగ్గిపోయింది. దీంతో ఈ కష్టాలు, సందర్భాలను అధిగమించలేక ప్రేమానురాగాలతో కొన్నేండ్లుగా సజావుగా సంసారం చేసుకున్న అనేక మంది దంపతులు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇరువురిలో సమన్వయం కొరవడి.. దానిని అధిగమిద్దామని ఆలోచించకుండా నువ్వెంతంటే నువ్వెంత అంటూ దూరమయ్యేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ అసహనం వారిని మద్యానికి బానిసలుగా మారుస్తుండగా, మరికొందరు అనవసరమైన గొడవలకు దిగుతూ వారి పరిస్థితిని మరింతగా దిగజార్చుకుంటున్నారు. వాహనం నడిపే సమయంలో తెలియకుండా కోపానికి గురై ఇతర వాహనదారులతో గొడవలకు దిగుతున్నారు.
యాంగ్రీ మేనేజ్మెంట్ కౌన్సెలింగ్తో ఫలితం..
కరోనా తగ్గిన తర్వాత తన వద్దకు వచ్చిన 1000 కేసుల్లో భార్యాభర్తల మధ్య అసహనం పెరిగిపోయిన విషయాన్ని గమనించా. ఈ కాలంలో వారికి కలిగిన ఆర్థిక నష్టం, 24/7 కలిసి ఉండటంతో వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులపై.. అనవసర అపోహలను పెంచుకుని ముఖ్యంగా ఉద్యోగులైన భార్యాభర్తల్లో కొట్లాటలు చాలా పెరిగాయి. ఆన్లైన్ క్లాసులు, చదువులంటూ పిల్లలు ఫోన్లకు అత్తుకుపోవడం వారిలో కోపాన్ని విపరీతంగా పెంచేసేంది. ఈ అసహనానికి ఆన్లైన్లో జూదం, అశ్లీలం, మద్యం తోడు కావడంతో మనస్సు కృంగిపోయి వారికి నెగెటివ్ ఆలోచనలను వస్తున్నాయి. దీంతో వారు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. వారికి ఐదు నుంచి ఎనిమిది రౌండ్ల వరకు కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పు కనిపించడంలేదు. ఇక్కడ ఇచ్చిన కౌన్సెలింగ్తో కేవలం 25 శాతం ఫలితాలను మాత్రమే సాధించా. ఇంకా ప్రయత్నిస్తున్నా.
యాంగ్రీ మేనేజ్మెంట్ అంటే..
ఇలా అసహనం, కోపం తలెత్తినప్పుడు మీకు మీరే ప్రశ్నించుకోవాలి.. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరే సరిగా అర్థం చేసుకుంటారు. కావున బయటి వారితో సంబంధం లేదు. మీ నిర్ణయాన్ని మీరే పాటించాలి. ఈ విధంగా కౌన్సెలింగ్లో భార్యాభర్తలకు వివరిస్తూ ఇతర అంశాలు .. ఉదాహరణలను వివరిస్తూ వారిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నా. వారిలో మార్పు కచ్చితంగా వస్తుంది.
-లావణ్య, మానసిక విశ్లేషకురాలు