షాద్నగర్, జూలై 13 : హైదరాబాద్లోని ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను బుధవారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించారు. నియోజకవర్గంలోని షాద్నగర్, కొత్తూరు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం భారీ మొత్తంలో నిధులను కేటాయించాలని మంత్రి కేటీఆర్ను కోరినట్లు ఎమ్మెల్యే వివరించారు. మున్సిపాలిటీల్లోని సీసీ రోడ్లు, అంతర్గత మురుగుకాలువల నిర్మాణాలు, పార్కులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు కావాలని.. ఆయా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృషి చేయాలని మంత్రిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు.