రంగారెడ్డి, జూలై 13, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఆగకుండా ముసురు వాన కురుస్తున్నది. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని మూసీ, ఈసీ నదులు కొంతమేర ప్రవహిస్తుండగా, జిల్లాలోని మెజార్టీ చెరువులు నిండుకుండలా మారాయి. పలు చెరువులు వర్షపు నీటితో నిండి అలుగు పారుతున్నాయి. మరోవైపు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం కురిసిన వర్షంతో జిల్లాలోని కొందుర్గు మండలం కొందుర్గులో 3.7 సెం.మీటర్లు, శంకర్పల్లిలో 3.3 సెం.మీటర్లు, గండిపేట మండలం మణికొండలో 3.2 సెం.మీటర్లు, చౌదరిగూడెం మండలం కాసులాబాద్లో 3.1 సెం.మీటర్లు, చేవెళ్ల మండలం కందవాడలో 2.8 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
అదేవిధంగా ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతానికి సంబంధించి కొందుర్గు మండలంలో 36.4 మి.మీటర్లు, గండిపేట మండలంలో 32.8 మి.మీటర్లు, చౌదరిగూడెం మండలంలో 30.5 మి.మీటర్లు, శంకర్పల్లి మండలంలో 28.9 మి.మీటర్లు, చేవెళ్లలో 26.5 మి.మీటర్లు, మొయినాబాద్లో 24.4 మి.మీటర్లు, శేరిలింగంపల్లిలో 25.1 మి.మీటర్లు, రాజేంద్రనగర్లో 23.6 మి.మీటర్లు, బాలాపూర్లో 21.3 మి.మీటర్లు, సరూర్నగర్లో 20 మి.మీటర్లు, హయత్నగర్లో 19.2 మి.మీటర్లు, శంషాబాద్లో 19.8 మి.మీటర్లు, అబ్దుల్లాపూర్మెట్లో 16.4 మి.మీటర్లు, ఇబ్రహీంపట్నంలో 13.3 మి.మీటర్లు, ఫరూఖ్నగర్లో 15.3 మి.మీటర్లు, షాబాద్ మండలంలో 16.4 మి.మీటర్లు, కేశంపేట మండలంలో 17.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా వర్షాలతో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం నిమిత్తం కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ఇప్పటివరకు నాలుగు ఇండ్లు పూర్తిగా నేలమట్టంకాగా, మరో 20 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా సరూర్నగర్లో చెట్టు విరిగిపడి ఒకరు మృతి చెందగా, నాలుగు పశువులు మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు.
వికారాబాద్ జిల్లాలో మోస్తరు వర్షం
పరిగి, జూలై 13: వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలోని మర్పల్లిలో 29.0 మి.మీ., మోమిన్పేట్లో 30.2 మి.మీ., నవాబుపేట్లో 23.4 మి.మీ., వికారాబాద్లో 28.0 మి.మీ., పూడూరులో 32 మి.మీ, పరిగిలో 13.2 మి.మీ., కులకచర్లలో 37.3 మి.మీ. దోమలో 50.4 మి.మీ., బొంరాస్పేట్లో 28.5 మి.మీ., ధారూర్లో 23.7 మి.మీ., కోట్పల్లిలో 28.8 మి.మీ., బంట్వారంలో 31.8 మి.మీ., పెద్దేముల్లో 33.5 మి.మీ., తాండూరులో 31.0 మి.మీ., బషీరాబాద్లో 35.9 మి.మీ., యాలాల్లో 27.8 మి.మీ., కొడంగల్లో 29.0 మి.మీ., దౌల్తాబాద్లో 32.3 మి.మీ, చౌడాపూర్లో 18.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో వాగులు వరద నీటితో ప్రవహించాయి. పలు చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది.