బషీరాబాద్, జూలై 13 : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేం దర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మంతన్గౌడ్తండాకు చెందిన నర్సింగ్కు రూ. 60 వేలు, కొర్విచేడ్ గ్రామానికి చెందిన అశోక్ రూ. 56వేల విలువైన చెక్కులను ప్రభుత్వం మంజూరు చేసింది.
బుధవారం ఎమ్మెల్సీ లభ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేదలు సీఎం సహాయ నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అల్లాపూరం వెంకట్రాంరెడ్డి ఉన్నారు.