కులకచర్ల, జూలై 13: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధ వారం కులకచర్ల మండల పరిధిలోని హస్మ్యానాయక్తండా గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న క్రియాశీలక కార్యకర్త లక్ష్మణ్నాయక్ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో మృతుడి కుటుంబసభ్యులకు బుధవారం రూ. రెండులక్షల బీమా చెక్కు ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ని నమ్ముకున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. బీమా చేయించిన పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబానికి రెండు లక్షలు ప్రమాద బీమా వస్తుందన్నారు. దీంతో పాటు మృతి చెందిన వారి పేర భూమి ఉండి రైతు బీమా చేయించుకుంటే ఐదులక్షల బీమా వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, టీఆర్ ఎస్ నాయకులు మాలె కృష్ణయ్యగౌడ్, ఆంజనేయులు, కొం డయ్య, మొగులయ్య, బచ్చిరెడ్డి, సారా శ్రీనివాస్, బుచ్చయ్య, గుండుమల్ల నర్సింహులు, కృష్ణారెడ్డి, రవినాయక్, ఉపసర్పంచ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణయ్య కుటుంబానికి అండగా ఉంటాం
కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రామంలో రెండు రోజుల క్రితం మృతి చెందిన చాకలి కృష్ణయ్య కుటుంబ సభ్యు లను ఎమ్మెల్యే పరామర్శించారు. కృష్ణయ్య కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం ద్వారా రావల్సిన సదుపా యాలను అందించే విధంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్ర మంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.