పరిగి, జూలై 9: త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ముస్లిం సోదరులకు ఆమె సూచించారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమ ప్రాధాన్యమిస్తున్నారని, అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.