తలకొండపల్లి, ఫిబ్రవరి 10 : రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రైతులకు కావాల్సిన సంచులు, లారీలను సమకూర్చి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం సూచించిన ధర ప్రకారం రైతుల వద్ద ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చెర్మన్ కేశవరెడ్డి, సర్పంచ్లు రమేశ్యాదవ్, రమేశ్, ఎంపీటీసీ రమేశ్, సింగిల్విండో వైస్ చెర్మన్ రవికుమార్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఆమనగల్లు : వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని, యువత వాటిపై దృష్టి పెట్టి స్వశక్తితో ఎదగాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. గురువారం మాడ్గుల మండలంలోని పాత బ్రహ్మణపల్లి గ్రామంలో గొర్రెలు, మేకల ఫాంను ఎమ్మెల్సీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య, సత్యం, రమేశ్గౌడ్, అశోక్గౌడ్, రాజశేఖర్గౌడ్ పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి సేవలందించాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానను పరిశీలించారు. వైద్యవిధాన పరిషత్ సూపరింటెండెంట్ ఝాన్సీలక్ష్మితో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్సీ నుంచి సీహెచ్సీ స్థాయి పెంపు వల్ల ఆమనగల్లు బ్లాక్ మండలాల ప్రజలకు వైద్య సదుపాయాలు పెరుగుతాయన్నారు. వైద్యవిధాన పరిషత్ పర్యవేక్షణలో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్కు సూచనలు చేశారు. ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానను 100 పడకల దవాఖానగా మార్చేందుకు తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నిక కావడంతో సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వస్పుల జంగయ్య, మహేశ్, బాబా పాల్గొన్నారు.