నందిగామ, ఫిబ్రవరి 10 : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల పరిధిలోని అయ్యప్పటెంపుల్ నుంచి జంగోనిగూడ గ్రామం వరకు రూ.2.50 కోట్ల సీఆర్ఆర్ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ వెంకట్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటేనే గ్రామాలు అభివృద్ధ్ది చెందుతాయని ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రానున్న రోజుల్లో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కుమార్గౌడ్, వార్డు సభ్యులు జంగ సింధు, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కృష్ణ, కుమారస్వామిగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, వై స్ చైర్మన్ రజినీకాంత్, నాయకులు మెండె కృష్ణ, నర్సింహ, రాజు, యాదగిరి, శ్రీను, శేఖర్, ప్రభు పాల్గొన్నారు.
కొందుర్గు : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఫీర్జాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం వల్ల కాలనీలు సుందరంగా మారుతాయని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, శ్రీధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దూలయ్య, నాయకులు రాంచంద్రయ్య, మోత్యానాయక్, రాములు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.