రైతురాజ్యమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ పిలుపునిచ్చారు. శనివారం షాబాద్ మండలం బొబ్బిలిగామ గ్రామంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జడ్పీటీసీ అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గులాబీ జెండాలు చేతబూని భారీ ర్యాలీతో ప్రజాప్రతినిధులకు ఘనస్వాగతం పలికారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు పన్నుతున్న కుట్రలను కలిసికట్టుగా తిప్పికొట్టాలన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులివ్వకుండా కేంద్ర సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, దీంతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇది మింగుడు పడని రాష్ట్ర బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలతో అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.
షాబాద్, మార్చి 18 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి ఎల్.రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జడ్పీటీసీ అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ జెండాలతో ర్యాలీతో ఘనస్వాగతం పలికాయి. ముందుగా బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 10 ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. వివక్షతో కూడిన కేంద్ర ప్రభుత్వ బీజేపీ, నరేంద్రమోడీ పాలన వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. భారతదేశంలో రైతురాజ్యం రావాలని కేసీఆర్ తపిస్తుంటే, కేంద్రం అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్ని దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాలకు అందించాలని, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్తో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరిచి, కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వాటిని చేధించాలన్నారు. రాబోయే కాలంలో మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య పరిష్కారం కావాలని, గతంలో అనేక ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి కానీ, అది మాటలకే పరిమితమయినట్లు తెలిపారు. నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, త్వరలో పనులు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, బంజారాహిల్స్ మాదిరిగా చేవెళ్ల ప్రాంతం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, వేల ఎకరాల్లో ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశ్రామికంగా ముందుకు పోతున్న ఈ ప్రాంతంలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు.
జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.పేదింటి ఆడబిడ్డలు ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు చేయించుకునేలా కేసీఆర్ కిట్ ద్వారా ఆడబిడ్డ పుడితే రూ.14వేలు, మగబిడ్డ పుడితే రూ.13వేలు అందించడంతో పాటు, 16 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అందిస్తున్నారన్నారు. మహిళా సంఘాలకు రుణాలు అందించి ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో ఒక్కొక్క మహిళా సంఘానికి రూ.లక్ష నుంచి రూ.2లక్షలు కూడా ఇవ్వడం లేదని, తెలంగాణలో ఒక్కో సంఘానికి రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతాల గురించి తప్ప, అభివృద్ధి గురించి మాట్లాడదని విమర్శించారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ పేదలు, రైతుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ సహకారంతో చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నట్లు తెలిపారు.
సీతారాంపూర్లో ఏర్పాటు కానున్న ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీలో తయారైన వాహనాలు దేశంలోని వివిధ రాష్ర్టాలకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎండకాలం వచ్చిదంటే తాగునీటి కోసం ఆడబిడ్డలు ఎన్నో కష్టాలు పడేవారని, ఆడబిడ్డల తాగునీటి కష్టాలను దూరం చేసేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నల్లానీరు అందిస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం, రైతు చనిపోతే రూ.5లక్షల బీమాను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి చేవెళ్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చిన్నట్లు తెలిపారు. ఇటీవలే రూ.25కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టిన్నట్లు వివరించారు. కొమరబండ, బొబ్బిలిగామ వాగులపై వంతెనల నిర్మాణానికి త్వరలో నిధులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బొబ్బిలిగామ సర్పంచ్ దండు అర్చన, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గూడూర్ నర్సింగ్రావు, పార్టీ రాష్ట్ర నాయకులు నక్క శ్రీనివాస్గౌడ్, శేరిగూడెం వెంకటయ్య, జడల రాజేందర్గౌడ్, పొన్న నర్సింహారెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, సర్పంచులు పోనమోని కేతన, కుర్వ జయమ్మ, నర్సింహారెడ్డి, దర్శన్, చంద్రశేఖర్, జంగయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఏండీ చాంద్పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్లు నర్సింగ్రావు, వెంకటరంగారెడ్డి, ప్రశాంత్గౌడ్, చేవెళ్ల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, పార్టీ మండల నాయకులు సుధాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, షబ్బీర్, రమేశ్యాదవ్, ముఖ్రంఖాన్, నానిగౌడ్, ప్రతాప్రెడ్డి, సుదర్శన్, దేవేందర్రెడ్డి, మల్లారెడ్డి, శ్రీశైలంగౌడ్, విశ్వం, వెంకటయ్య, గణేశ్గౌడ్, కృష్ణగౌడ్, రాజేందర్రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.