రంగారెడ్డి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కుండపోత వర్షం జిల్లాను ముంచెత్తింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోజంతా ఏకధాటిగా వర్షం కురువడంతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ను ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 421.2మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా శేరిలింగంపల్లిలో 38.3 మి.మీ వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. మూసీ, ఈసీ వాగులు ఉప్పొంగుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజానీకాన్ని అప్రమత్తం చేస్తున్నది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు జిల్లావాసులకు సూచించారు.
జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రివరకు ఏకధాటిగా వర్షం కురువడంతో 421.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 38.3 మి.మీ వర్షం కురిసింది. వదలని వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. మూసీ, ఈసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కుండపోత వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించింది. మం గళవారం అన్ని స్కూళ్లకు విద్యాశాఖ సెలవును ప్రకటించింది. మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో అన్ని మండలాల్లోనూ ఆశించిన మేర వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాలేదు. మరోవైపు జిల్లాలో బుధవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లాకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాశాఖ జిల్లాలోని అన్ని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించింది.
జిల్లాలో వర్షపాతం ఇలా..
జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 421.2మిల్లీమీటర్ల వర్షం కురియగా..జిల్లా సగటు వర్షపాతం 15.6మిల్లీమీటర్లుగా నమోదైంది. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 38.3మి. మీ, గండిపేటలో 32.0మి.మీ, శంషాబాద్లో 24.0మి.మీ, చౌదరిగూడెంలో 23.5 మి.మీ, రాజేంద్రనగర్లో 22.0మి.మీ, కొందుర్గ్గులో 21.3మి.మీ, శంకర్పల్లిలో 17.4 మి.మీ, మహేశ్వరంలో 17.2మి.మీ, మొయినాబాద్లో 16.మి. మీ, కందుకూరులో 16.0మి.మీ, అబ్దుల్లాపూర్మెట్, చేవెళ్లలలో 15.9 మి.మీ, నందిగామలో 15.5మి.మీ, యాచారంలో 14.4మి.మీ, బా లాపూర్లో 14.2మి.మీ, కొత్తూరులో 13.0మి.మీ, హయత్నగర్లో 12.7మి.మీ, ఫరూఖ్నగర్లో 11.8మి.మీ, షాబాద్లో 11.2 మి.మీ, కడ్తాల్లో 11.2 మి.మీ, సరూర్నగర్లో 10.8మి.మీ, ఇబ్రహీంపట్నంలో 10.7మి.మీ, కేశంపేటలో 10.0మి.మీ, ఆమనగల్లులో 7.5మి.మీ, తలకొండపల్లి, మాడ్గులలో 6.7మి.మీ, మంచాలలో 4.8మిల్లీమీటర్ల వర్షం కురిసింది.