తాండూరు, ఫిబ్రవరి 26: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాం డూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రజాబంధు యాప్ను రూపొందించారు. నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా మొబైల్ ఫోన్ ప్లేస్టోర్లో ప్రజాబంధు అప్లికేషన్ యా ప్ను ఆవిష్కరించి నియోజకవర్గంలోని పట్టణం, గ్రామాల్లోని సమస్యలను ఫోన్ ద్వారా వెంటనే తెలుసుకునేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. దీనిని సమర్థవంతంగా నిర్వహించేందుకు నియోజకవర్గంలోని 10 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి కో-ఆర్డినేటర్లను నియమించారు. ఇటీవలె అధికారులతోపాటు పరిశీలకులకు కూడా శిక్షణ ఇచ్చారు. ఈ యా ప్ను నేడు ఎమ్మెల్యే తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆవిష్కరించనున్నట్లు శనివారం ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకునేందుకు ప్రజాబంధు మొబైల్ అప్లికేషన్ యాప్ పనిచేస్తుంది. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీకార్డు, పింఛన్ మంజూరు, విద్యుత్, తాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ వంటి పలు సమస్యలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలను పాలకులతోపాటు అధికారుల దృష్టికి త్వరగా తీసుకెళ్లేందుకు ఈ యాప్ కీలకంగా పనిచేస్తుంది. ప్రజలు తమ సమస్యలను ఉన్న చోటు నుంచే నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు.