ధారూరు, డిసెంబర్ 28 : వికారాబా ద్ జిల్లాలో అర్హులకు ప్రభుత్వ పథ కా లను అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని రాజాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలో అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారెంటీలను అమ లు చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను సేకరిస్తున్నదన్నారు.
జనవరి 6వ తేదీ వరకు అన్ని పని దినాల్లో గ్రామా లు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ప్రజల నుంచి దరఖాస్తులను అధికారులు సేకరిస్తారన్నారు. పేదలకు ప్రభుత్వ పథకాలను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఇందుకోసం జిల్లాలో 57 బృందాలను ఏర్పాటు చేశామని.. కుటుంబం నుంచి ఒకరు వచ్చి దరఖాస్తు చేస్తే సరిపోతుందని, అన్ని పథకాలకు సంబంధించి ఒక దరఖాస్తును అందిస్తే చాలన్నారు. దరఖాస్తుదారులకు తప్పని సరిగా రసీదును ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. అనంతరం ఆయన గ్రామసభలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీక రించారు. కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, ఎంపీడీవో చిన్నారెడ్డి, తహసీల్దార్ భవనేశ్వర్, డీఎస్పీ నర్సింహులు, ఎంఈవో బాబుసింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.