షాబాద్, నవంబర్ 12: వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారులకు జా ప్యం లేకుండా రుణాలను అందించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని తేల్చిచెప్పారు. సంక్షేమ శాఖల అధికారులు బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న, గ్రౌండింగ్ కాని యూనిట్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నా రు. పీఎంఈజీపీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధించిన రుణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2022-23ను అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రిజ్వాన్, ఆర్బీఐ ఏజీఎంఎమ్జెడ్ రహమాన్, నాబార్డు డీడీఎం శివశర్మ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.