తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొ టెం స్పీకర్ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.
ముందుగా సీఎం రేవంత్రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం, మంత్రులు.. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఈ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఆ రోజున వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నది. – న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ