వికారాబాద్, జూలై 12 : కురుస్తున్న వర్షాల వల్ల పొలాల్లో నిలిచే వర్షపు నీటితో పంటలకు నష్టం కలుగుతుందని, వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి పంటలు కాపాడుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్కుమార్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని మదన్పల్లి, చెంచుపల్లిలో రైతు పొలాలను పరిశీలించి, సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పొలాల్లో వర్షపు నీరు నిలుస్తున్నదని, రైతులు పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వర్షాలు తగ్గిన కొన్ని రోజులు తరువాత 20కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం వాడటం వల్ల పంటలకు నష్టం వాటిల్లదన్నారు.
ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
మర్పల్లి, జూలై 12 : వానకాలం పంటలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఏఈవో మహేశ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వీర్లపల్లి, సిరిపురం గ్రామాల్లో రైతుల పొలాలను సందర్శించి పంటల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలని పంటల పట్ల తగు జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. పంట కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆన్లైన్ నమోదును తప్పకుండా చేసుకోవాలని, దీని ద్వారా మద్దతు ధరకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
ధారూరు మండలంలో..
ధారూరు, జూలై 12: రైతులు సాగు చేసిన పంటలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ధారూరు మండల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి అన్నారు. మంగళ వారం ధారూరు మండల కేంద్రంలోని పంటపొలంలో రైతు సాగు చేసిన పంటలను ఏఈవో సంజువ్ రాథోడ్తో కలిసి ఆన్లైన్లో నమోదు చేశారు.