సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) ; ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఏరియా, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని మున్సిపాలిటీల ఏరియాను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)గా గుర్తించి ఈ మేరకు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)గా ప్రకటించింది. ఇందులో భాగంగానే 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలోకి విలీన ప్రతిపాదనకు మంత్రి వర్గంతో పాటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేశారు. ముసాయిదా దస్త్రంపై రెండు రోజుల క్రితం గవర్నర్ సంతకం చేశారు. ఇదే క్రమంలో రాబోయే మూడు రోజుల్లో మరో మూడు గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ విభాగం పరిధిలో ఉన్న ఈ 27 స్థానిక సంస్థలను ఆ పరిధిలో నుంచి తొలగిస్తున్నట్లు, ప్రకటించేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు.
జీహెచ్ఎంసీ విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం 3 ఆర్డినెన్స్లు తీసుకురావాలని నిర్ణయించింది. వాటిలో రెండు జీహెచ్ఎంసీకి, ఒకటి మున్సిపల్ శాఖకు చెందినదిగా ఉన్నాయి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్కు చట్టబద్ధత కల్పించనున్నారు. జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను కలిపేందుకు మరో ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. 27 పట్టణ స్థానిక సంస్థలను మున్సిపల్శాఖ నుంచి తొలగించేందుకు మరో ఆర్డినెన్స్ తెనున్నారు. ఈ 3 ఆర్డినెన్స్లకు బుధ, గురువారాల్లో గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం 27 పట్ట ణ స్థానిక సంస్థలకు చెందిన సమాచారంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వా ర్డుల వివరాలు, సరిహద్దులను విలీ నం చేస్తూ అధికారులు చేపట్టిన వార్డుల పునర్విభజనకు సంబంధించి 3 రోజుల్లో డీలిమిటేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించను
న్నట్లు తెలిసింది.
తుక్కుగూడను గ్రేటర్లో విలీనం చేయొద్దు : ఆల్ పార్టీ జేఏసీ
బడంగ్పేట : తుక్కుగూడ మున్సిపాలిటీని గ్రేటర్లో విలీనం చేయడా న్ని వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల నాయకులు జేఏసీగా ఏర్పడి మంగళవారం ఆందోళన చేపట్టారు. అనంతరం తుక్కుగూడలో సమావేశమై వారు మాట్లాడుతూ.. తుక్కుగూడ మున్సిపాలిటీకి సరిహద్దులో ఉన్న బడంగ్పేట కార్పొరేషన్, ఆదిబట్ల మున్సిపాలిటీని ఎల్బీనగర్ జోన్ పరిధిలో కలుపుతున్నారని..అదే తుక్కుగూడను ఎందుకు చార్మినార్ జోన్ లో కలుపుతున్నారో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వోఆర్ఆర్ ఏర్పడిన తర్వాతే తుక్కుగూడ అభివృద్ధి చెందిందన్నారు. గతంలో ఓల్డ్సిటీ బార్కస్, ఎర్రకుంట నుంచి రోడ్డు ఉండడంతో వం దల ఏండ్ల నుంచి తుక్కుగూడ పరిసరాలు అభివృద్ధికి నోచుకోలేదన్నా రు. తుక్కుగూడను జీహెచ్ఎంలో కలిపే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తుక్కుగూడకు ప్రత్యేక కార్పొరేషన్ చేయాలన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
జోన్లకు మరిన్ని అధికారాలంటూ చర్చ
జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న 150 వార్డులను 261 వార్డులుగా పునర్విభజించే ప్రక్రియలో తలమునకలైన అధికారులు, జీహెచ్ఎంసీలో విలీనం కానున్న 27 స్థానిక సంస్థలను మరో 40 నుంచి 45 వార్డులుగా పునర్విభజించి, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మొత్తం 306 మున్సిపల్ వార్డులు చేసే కసరత్తు దాదాపు తుది దశలో ఉన్నట్లు అధికారుల్లో చర్చ జరుగుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న ఆరు జోన్లను ఎనిమిది గానీ, పదిగా ఏర్పాటు చేస్తారన్న ప్రచారం ఉంది. జీహెచ్ఎంసీ పరిధి గణనీయంగా పెరుగుతుండటంతో ఎకువ కార్యకలాపాలు జోనల్ స్థాయిలో జరిగేలా అధికార వికేంద్రీకరణ జరగనున్నట్లు, ఇందులో భాగంగా జోన్లకు మరిన్ని అధికారాలు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయంటున్నారు.ప్రస్తుతం అయిదు అంతస్తుల వరకు నిర్మాణ అనుమతులను మంజూరు చేసే పవర్ ఉన్న జోన్లకు మున్ముందు పది అంతస్తుల బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ అనుమతులు జారీ చేసేలా పవర్ పెంచనున్నట్లు సమాచారం.