యాచారం : మండలంలోని గ్రామాలను బుధవారం తెల్లవారుజామున పొగమంచు కమ్మేసింది. ఉదయం 9దాటినా మంచు దుప్పటి నుంచి గ్రామాలు తేరుకోలేదు. నాగార్జున సాగర్ రహదారిని మంచు ముంచేసింది. ఎదురుగా వచ్చే వాహనం దగ్గరికి వచ్చేవరకు కనిపించక పోవడం గమనార్హం. వాహనదారులు ఉదయం 9గంటలు దాటినప్పటికీ లైట్స్ వేసుకొని వాహనాలను నడిపారు. రైతులు, వ్యాపారులు పొగమంచుతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గున్గల్, యాచారం, తక్కళ్లపల్లిగేటు, మాల్ ప్రాంతాల్లో పొగమంచుతో ప్రజలు, ప్రయాణికులు, వ్యాపారులు అవస్థలు పడ్డారు.