షాద్నగర్రూరల్ : చిన్నారులకు న్యుమోనియ టీకాను తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్ సూచించారు. బుధవారం పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాల సమీపంలో డాక్టర్ సాయిలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన టీకా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్నారుల ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగానే పుట్టిన 45రోజుల నుంచి 9నెలలలోపు ఉన్న చిన్నారులకు టీకాను వేయించాలన్నారు. టీకా తీసుకుంటే చిన్నారుల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. అదే విధంగా మున్సిపాలిటీలోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన టీకా కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రేమలత యుగేందర్, నాయకుడు నర్సింహులు పాల్గొన్నారు.
కేశంపేట : తల్లిదండ్రులు తమ చిన్నారులకు నిమోనియా టీకాలను వేయించాలని కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్రెడ్డి సూచించారు. మండలంలోని పాపిరెడ్డిగూడలో బుధవారం నిమోనియా టీకా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని చిన్నారులకు వైద్య సిబ్బంది టీకాలను వేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుందరయ్య, నాయకులు తాండ్ర శ్రావణ్రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్గౌడ్, శ్రీను, హన్మంతు, యాదయ్య, శేఖర్, దావీదు, రవి, మల్లయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.