ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 6 : మండల పరిధిలోని ఎలిమినేడు, కప్పాడు గ్రామాల సమీపంలో నిర్మిస్తున్న రైస్మిల్లు నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు శనివారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఎలిమినేడు సర్పంచ్తో పాటు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ విషయమై కలెక్టర్, డీపీవోలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, ఎలిమినేడు, కప్పాడు గ్రామాల రైతులు శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్, మహేశ్, రమేశ్, శ్రీనివాస్, భాస్కర్, దేవదాసు, మల్లేశ్ పాల్గొన్నారు.