షాద్నగర్టౌన్, జనవరి 8 : దళిత బంధు పథకంతో అర్హులైన దళితులకు శాశ్వత ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్కు చెందిన మాస్క జగన్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ఎర్టిగా కారును ఆదివారం వారు లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారని. తెలంగాణ ఏర్పడ్డాకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు పెద్దపీట వేయడంతో వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. వారి ఆర్థిక ఎదుగుదల కోసం సర్కార్ దళిత బందు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీంతో అర్హులైన దళితులు ఈ పథకంతో ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను పలు రాష్ర్టాలు అనుసరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, కేశంపేట జడ్పీటీసీ విశాల, కౌన్సిలర్ మహేశ్వరి, ఎలికట్ట సర్పంచ్ సాయిప్రసాద్, నాయకులున్నారు.
షాద్నగర్ : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తన పరిపాలన కొనసాగిస్తున్నారని, డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జాబ్మేళాలను నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్లోని రెడ్ రోజ్ గార్డెన్లో నిర్వహించిన మెగా జాబ్మేళాను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుద్యోగుల ఉద్యోగ కల్పనకు తెలంగాణ సర్కార్ ఎంతో కృషి చేస్తున్నదన్నారు. యువత పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రతతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చన్నారు.
నిరుద్యోగుల కోసం మెగా జాబ్మేళాను నిర్వహించడంపై నిరుద్యోగులు ప్రభుత్వానికి, మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. జాబ్ మేళాలో 2202 మంది నిరుద్యోగులు పాల్గొనగా.. 360 మందిని నేరుగా ఎంపిక చేశారు. మరో 776 మందిని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. జాబ్మేళాలో ఎంపికైన నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, మేకగూడ పీఏసీఎస్ చైర్పర్సన్ మంజుల, ఏసీపీ కుషాల్కర్, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు మహేశ్వరి, సర్వర్పాషా, శ్రీనివాస్, అంతయ్య, నాయకులు దేవేందర్యాదవ్, శంకర్, శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు.