బంట్వారం, డిసెంబర్13 : మండల పరిధిలోని మాల సోమా రం వాగుపై బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మాలసోమారం-బార్వాద్ గ్రామాల మధ్య దూ రం కేవలం మూడు కిలో మీటర్లు ఉంది. అయితే వర్షాకాలం సుమారు 12 కిలో మీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తున్నదని గ్రామ స్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాలసోమారం-బార్వాద్ రోడ్డులో రెండు వాగులు ఉంటాయి. వర్షాకాలంలో నీళ్ల ప్రవాహం అధికంగా ఉంటుంది. ఈ రోడ్డుకు ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడితే రెండు గ్రామాల మధ్య రాక పోకలకు ఎంతో సౌకర్యవం తం ఉంటుంది. అంతేకాక దూరం కూడా తగ్గుతుంది. గతంలో ఈ రోడ్డు నిర్మాణానికి ఏపీఆర్డీపీ నిధులు రూ 1.90 కోట్లు మంజూరు చేశారు. దీంతో రెండున్నర కిలో మీటర్లు బీటీ రోడ్డును వేశారు. మిగతా రోడ్డు పూర్తి చేయాలంటే మరో 2 కోట్ల రూపాయల అవసరమవుతాయని అధికారులు, పరిసర గ్రా మాల సర్పంచ్లు తెలిపారు. ఇటీవల గ్రామానికి వచ్చిన ఎమ్మె ల్యే ఆనంద్ దృష్టికి గ్రామస్తులు ఈ విషయాన్ని తీసుకెళ్లగా సీఎం కేసీఆర్తో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మండల సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలోనూ మంత్రి సబితారెడ్డిని కలిశారు. మంత్రి సైతం సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సర్పం చ్లు తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యను పట్టించుకోని ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ నర్సింహారెడ్డి, గ్రామస్తులు కోరుతున్నారు.