ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 8 : ఎన్నికలప్పుడే కాంగ్రెస్పార్టీ నాయకులకు ప్రజలు గుర్తుకు వస్తారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బండరావిరాల గ్రామం నుంచి 100మంది, యాచారం మండలంలోని అయ్యవారిగూడ నుంచి 70మంది, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమాముల నుంచి 15మంది, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 22వ వార్డులోని జంగాల బస్తీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
కాంగ్రెస్పార్టీ నాయకులు ఎన్నికల ముందు గోనసంచులతో ప్రజల వద్దకు వచ్చి కల్లబొల్లి కబుర్లుచెప్పి లబ్ధిపొందటానికి ప్రయత్నిస్తారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, ఎంపీపీ కృపేశ్, వైస్ చైర్మన్ యాదగిరి, పార్టీ యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్, పార్టీ అబ్దుల్లాపూర్మెట్ మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, కౌన్సిలర్లు యాచారం సుజాత, నీలం శ్వేత, మంద సుధాకర్, బర్తాకి జనగ్, సుల్తాన్, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్కుమార్, నీలం బాలు, యాచారం రవీందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.