కొడంగల్, డిసెంబర్ 3: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి 33 వేల 214 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి 78,847 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డికి లక్షా 12వేల 061ఓట్లు వచ్చాయి.
మొదటి రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ ముందంజలో ఉండి మెజారిటీని సాధించింది. కొడంగల్ పరిధిలో పోలైన ఓట్లు మొత్తం 1,19,940 కాగా 1165పోస్టల్ ఓట్లు ఉన్నాయి. ఓట్ల లెక్కింపులో 14 టేబుల్స్లో 20 రౌండ్లో ఓట్లను లెక్కించారు.