ఇబ్రహీంపట్నం, జనవరి 17 : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కొహెడకు చెందిన 10మంది యువకులు మంగళవారం ఎమ్మెల్యే కిషన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఎవరెన్నీ కుట్రలు పన్నినా దేశంలో భవిష్యత్లో బీఆర్ఎస్పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటం ఖాయమని అన్నారు. పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు తిరుమల్లేశ్, శ్రీనివాస్, రాఘవేందర్ ఉన్నారు.
అభివృద్ధిని వివరించేందుకే పార్టీ కార్యక్రమాలు
మంచాల : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బీఆర్ఎస్ నియోజక వర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేయాలన్నారు. మున్సిపాలిటీలకు విరివిగా కోట్ల రూపాయలు రాబడుతూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈనెల 22వ తేదీ నుంచి మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి మండలాల వారీగా ప్రగతి నివేదన పాదయాత్ర చేపడుతారని, శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లాఅధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ బుగ్గరాములు తదితరులు పాల్గొన్నారు.